18, అక్టోబర్ 2012, గురువారం

జగనన్న వదిలిన బాణాన్ని: షర్మిల

ఇడుపులపాయ : రాజన్న కూతురిగా..... జగనన్న చెల్లెలిగా... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వస్తున్నానని షర్మిల తెలిపారు. తాను జగనన్న వదిలిన బాణాన్ని అని.... అందరూ కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు.

ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల మాట్లాడుతూ మరో ప్రజా ప్రస్థానానికి రెండే ప్రధాన అంశాలని ....ఒకటి అసమర్థ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, రెండోది అసమర్థ ప్రభుత్వాన్ని కాపాడుతున్న చంద్రబాబును నిలదీయటమే లక్ష్యమన్నారు. జగనన్న నాయకత్వంతోనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని ఆమె అన్నారు.

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా తాను నల్లబ్యాడ్జి పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నట్లు షర్మిల తెలిపారు. వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు, జగన్ అభిమానులు కూడా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని ఆమె కోరారు

16, అక్టోబర్ 2012, మంగళవారం

నా గురించి

నా పేరు శివశంకర రెడ్డి.

నేను ఒక బహుళ జాతి కంపెనీలొ Software Engineer గ పని చేస్తున్నాను.

మా ఊరు :- పాలువాయి, గుంటూరు జిల్లా.

ఇప్పుడు నేను హైదరాబాదు లో ఉంటున్నాను.

15, అక్టోబర్ 2012, సోమవారం

నా మొదటి పోస్ట్

హలో అందరికి నమస్కారం.

నా పేరు శివ. నేను కొత్తగా ఈ బ్లాగ్ ప్రపచంలొకి వస్తున్నాను.

నన్ను మీతొ కలుపుకొండి. 

ధన్యవాదాలు.